Latest News

  • Bank Holidays: ఏప్రిల్‌లో పెద్ద పండుగలు, నెలలో సగం రోజులు బ్యాంక్‌లు బంద్‌
    by Arun Kumar Veera on March 28, 2024 at 5:36 am

    <p><strong>Bank Holidays List For April 2024:</strong> కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభానికి గుర్తుగా, వచ్చే నెలలో (ఏప్రిల్&zwnj;) దేశవ్యాప్తంగా బ్యాంకులు వరుస సెలవుల కోసం సిద్ధమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన వార్షిక సెలవుల జాబితా ప్రకారం, ప్రభుత్వ &amp; ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏప్రిల్&zwnj; నెలలో 14 రోజుల పాటు మూతబడతాయి.&nbsp;</p> <p>ఏప్రిల్&zwnj; నెల మొదటి రోజు నుంచే బ్యాంక్&zwnj;ల సెలవులు ప్రారంభం అవుతాయి. ఆ నెలలో ఉగాది (Ugadi 2024), గుఢి పడ్వా, ఈద్-ఉల్-ఫితర్ (Ramadan 2024), బోహాగ్ బిహు, శ్రీరామ నవమి &zwj;&zwnj;(Rama Navami 2024), బైశాకి వంటి పండగలు, వివిధ సందర్భాల కారణంగా బ్యాంక్&zwnj;లకు సెలవులు వచ్చాయి. ఏప్రిల్&zwnj; నెలలోని 4 ఆదివారాలు, రెండో &amp; నాలుగో శనివారాలు కూడా బ్యాంక్&zwnj; హాలిడేస్&zwnj; లిస్ట్&zwnj;లో కలిసి ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం సెలవుల సంఖ్య ఒకే విధంగా ఉన్నప్పటికీ, రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి సెలవు రోజు మారవచ్చు.&nbsp;</p> <p>వచ్చే నెలలో మీకు బ్యాంక్&zwnj;లో ఏ పని ఉన్నా, బ్యాంక్&zwnj; హాలిడేస్&zwnj; లిస్ట్&zwnj;ను ముందుగా సేవ్&zwnj; చేసుకోండి. సెలవు రోజులను గుర్తు పెట్టుకుంటే, ఆ రోజుల్లో బ్యాంక్&zwnj;కు వెళ్లకుండా ఆగొచ్చు, సమయం వృథా కాకుండా ఉంటుంది.</p> <p><strong>2024 ఏప్రిల్&zwnj;లో బ్యాంక్&zwnj; సెలవు రోజులు &zwj;&zwnj;(Bank Holidays in April 2024):&nbsp;</strong></p> <p>- ఏప్రిల్ 01 (సోమవారం): వార్షిక ఖాతాల ముగింపు కోసం బ్యాంకులను మూసివేస్తారు, లావాదేవీలు జరగవు.&nbsp;<br />- ఏప్రిల్ 05 &zwj;&zwnj;(శుక్రవారం): బాబు జగ్జీవన్ రామ్ జయంతి, జుమాత్-ఉల్-విదా<br />- ఏప్రిల్ 07&zwj;: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్&zwnj;లు పని చేయవు<br />- ఏప్రిల్ 09 &zwj;&zwnj;(మంగళవారం): గుఢి పడ్వా, ఉగాది, సాజిబు నొంగ్మపన్బా (చెయిరాబా), 1వ నవరాత్రి<br />- ఏప్రిల్ 10 &zwj;&zwnj;(బుధవారం): రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్)<br />- ఏప్రిల్ 11 &zwj;&zwnj;(గురువారం): రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) (1వ షావాల్)<br />- ఏప్రిల్ 13&zwj;: బోహాగ్ బిహు, చీరోబా, బైశాఖి, బిజు పండుగ + రెండో శనివారం<br />- ఏప్రిల్ 14: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్&zwnj;లు పని చేయవు<br />- ఏప్రిల్ 15 &zwj;&zwnj;(సోమవారం): బోహాగ్ బిహు, హిమాచల్ డే<br />- ఏప్రిల్ 17 (బుధవారం): శ్రీరామ నవమి<br />- ఏప్రిల్ 20 (శనివారం): గరియా పూజ<br />- ఏప్రిల్ 21: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్&zwnj;లు పని చేయవు<br />- ఏప్రిల్ 27: నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్&zwnj;లకు సెలవు<br />- ఏప్రిల్ 28: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్&zwnj;లు పని చేయవు</p> <p>సెలవు రోజుల్లోనూ మీ పని ఆగదు<br />ప్రస్తుతం, బ్యాంకింగ్&zwnj; టెక్నాలజీ చాలా పెరిగింది. మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్&zwnj;లు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, బ్యాంక్&zwnj; హాలిడేస్&zwnj; మీ పనులపై పెద్దగా ప్రభావం చూపవు. ఈ డిజిటల్&zwnj; సర్వీస్&zwnj;లు 24 గంటలూ, భారతదేశం అంతటా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్&zwnj; ముందుగానే మీకు తెలియజేస్తుంది.&nbsp;</p> <p>భారతదేశంలో, బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్&zwnj; అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మొత్తం సంవత్సరానికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్&zwnj;ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి.&nbsp;</p> <p>మరో ఆసక్తికర కథనం: <a title="భారీ షాక్&zwnj; ఇచ్చిన స్వర్ణం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి" href="https://telugu.abplive.com/business/latest-gold-silver-prices-today-28-march-2024-know-rates-in-your-city-telangana-hyderabad-andhra-pradesh-amaravati-153426" target="_self">భారీ షాక్&zwnj; ఇచ్చిన స్వర్ణం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి</a></p>

  • Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
    by ABP Desam on March 28, 2024 at 5:34 am

    <p><strong>Amalapuram Parliamentary Constituency:</strong> వైఎస్సాఆర్&zwnj;సీపీ(YSRCP) అమలాపురం పార్లమెంటు అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేసిన అధిష్టానం.. చివరకు రాకాపక వరప్రసాద్&zwnj;(Rapaka Varaprasad)ను బరిలోకి దింపింది. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సరైన అభ్యర్ధి లేకనే రాపాకను రంగంలోకి దింపారనే టాక్ నడుస్తోంది. ఆయనకు పెద్దగా ఆసక్తి లేకున్నా తప్పక, తప్పదని బరిలో నిల్చున్నారనే వాదన కూడా ఉంది. జరుగుతున్న ఈ ఊహాగానాలకు ఆయన ప్రచారమే ఊతమిస్తోంది.&nbsp;</p> <p><strong>ఇష్టం లేకున్నా బరిలోకి...</strong><br />సిట్టింగ్&zwnj; ఎంపీ చింతా అనురాధ(Chinta Anuradha)ను పక్కనుపెట్టి రాజోలు(Razole Assembly) సీటు ఆశించిన రాపాకను అమలాపురం పార్లమెంటు స్థానానికి పంపించారు. దీని వెనుక వైసీపీ వ్యూహం ఏదైనప్పటికీ ఆయనకు మాత్రం ఎంపీగా పోటీ చేయడం అంతగా ఇష్టం లేదని సన్నిహితులు చెబుతున్న మాట. టిక్కెట్టు కోల్పోయిన సిట్టింగ్&zwnj;ల కంటే తనపై అధిష్టానం మంచి దృక్పథంతోనే ఈ అవకాశం కల్పించిందన్న సంతృప్తితో రంగంలోకి దిగారు. ప్రచారంలో మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదని ప్రత్యర్థితో పోలిస్తే దూకుడుగా వెళ్లలేకపోతున్నరని స్థానికంగా వినిపిస్తున్న ప్రధాన విమర్శ.&nbsp;</p> <p>2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోగా ఒక్క రాజోలు సీటు మాత్రమే దక్కించుకుంది. ఈ స్థానం నుంచి గెలిచిన <a title="జనసేన" href="https://telugu.abplive.com/topic/Janasena" data-type="interlinkingkeywords">జనసేన</a> ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తక్కువ కాలంలోనే వైసీపీ గూటికి చేరారు. అధికార పార్టీలో చేరినా రాజోలు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నిర్వహించిన సర్వేలో రాపాక ఓటమి ఖాయం అని తేలడంతో అక్కడ అభ్యర్ధిని మార్చేపనిలో ఉండగానే <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> నేత గొల్లపల్లి సూర్యారావు(Gollapalli Suryarao)ను తెరపైకి తీసుకొచ్చారు. ఒకే సమయంలో అసెంబ్లీకు వైసీపీ అభ్యర్థిగా గొల్లపల్లి, అమలాపురం ఎంపీ అభ్యర్ధిగా రాపాకను ప్రకటించారు.</p> <p><strong>ఇంతకీ ఎందుకీ నిస్తేజం..&nbsp;</strong><br />రాజోలు అసెంబ్లీ స్థానానికి గొల్లపల్లిని ప్రకటించడంతో రాపాక తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారన్న గుసగుసలు వినిపించాయి. రాజోలు రాపాకకే ఇవ్వాలన్న డిమాండ్&zwnj;తో నిసరన స్వరాలు వినిపించాయి. రాజోలు విషయంలో అధిష్టానం మరోసారి పునరాలోచించుకోవాలని రాపాక కోరారు. అధినాయకత్వం సర్ది చెప్పడంతో మేమిద్దరం ఒక్కటేనని, గొల్లపల్లి గెలుపు కోసం అంతా కృషి చేస్తామని ప్రకటించారు. తనకు అమలాపురం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేసినా ప్రచారంలో వేగాన్ని అందుకో లేకపోతున్నారు. దీంతో ఆయనకు ఎంపీ స్థానంపై అసలు ఇంట్రెస్ట్&zwnj; ఉందా.. గెలుస్తామా... అన్న మీమాంసలో కేడర్ కూడా కొట్టుమిట్టాడుతోంది. ఆయనికి కూడా ఇదే అనుమానాలు ఉన్నాయని అందుకే ప్రచారం అనుకున్న స్థాయిలో సాగడం లేదని టాక్.&nbsp;</p> <p><strong>రగిలిపోతున్న జనసైనికులు..</strong><br />రాజోలులో తమ పార్టీ తరఫున గెలిచి ఆ తరువాత పార్టీ ఫిరాయించిన రాపాకపై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే బహిరంగంగానే రాపాకపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. వైసీపీలో ఉన్న ఓ వర్గం కూడా ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తుందన్న ప్రచారం నియోజకవర్గంలో నడుస్తోంది. వాళ్లు కూడా క్రాస్&zwnj; ఓటింగ్&zwnj;కు పాల్పడే అవకాశం లేకపోలేదన్న మాటలు వినిపిస్తున్నాయి.&nbsp;</p> <p><strong>దూసుకుపోతున్న ప్రత్యర్ధి..</strong><br />వైసీపీ ఎంపీ అభ్యర్ధి రాపాక వరప్రసాదరావు ప్రచారంలో ఇంకా స్పీడు అందుకోకపోగా కూటమి అభ్యర్ధి గంటి హరీష్&zwnj;మాధూర్&zwnj; (Ganti Harishmadhur) ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మండపేట (Mandapeta), ముమ్మిడివరం (Mummidivaram), కొత్తపేట (Kothapeta), పి.గన్నవరం (P. Gannavaram) నియోజకవర్గాలతోపాటు అమలాపురంలో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి సంబందించి సానుభూతి, జీఎంసీ బాలయోగి కుమారుడు కావడం కూడా ఆయనకు కలిసొచ్చేలా చూసుకుంటున్నారు.</p>

  • Latest Gold-Silver Prices Today: భారీ షాక్‌ ఇచ్చిన స్వర్ణం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
    by Arun Kumar Veera on March 28, 2024 at 5:04 am

    <p><strong>Latest Gold-Silver Prices 28 March 2024:</strong> యూఎస్&zwnj; పీసీయీ డేటా మీద ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడంతో అంతర్జాతీయ మార్కెట్&zwnj;లో పసిడి మరింత ప్రకాశవంతంగా మారింది. ప్రస్తుతం, ఔన్స్&zwnj; (28.35 గ్రాములు) బంగారం ధర 2,212 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్&zwnj; బంగారం &zwj;&zwnj;(22 కేరెట్లు) ధర 350 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి &zwj;&zwnj;(24 కేరెట్లు) ధర 380 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 290 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు ₹ 300 పెరిగింది.</p> <p><strong>తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)</strong></p> <p>తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)<br />హైదరాబాద్&zwnj; (Gold Rate in Hyderabad) మార్కెట్&zwnj;లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 61,700 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 67,310 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 50,480 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్&zwnj;లో ₹ 80,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.</p> <p>ఆంధ్రప్రదేశ్&zwnj;లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)<br />విజయవాడలో &zwj;(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 61,700 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 67,310 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 50,480 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 80,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్&zwnj;లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.&nbsp;</p> <p><strong>దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)&nbsp;</strong></p> <p>చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 62,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 68,180 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.<br />ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 61,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 67,310 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.<br />దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 61,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 67,460 గా నమోదైంది. జైపుర్&zwnj;, లఖ్&zwnj;నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.<br />కోల్&zwnj;కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 61,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 67,310 గా ఉంది. నాగ్&zwnj;పుర్&zwnj;లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.<br />బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 61,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 67,310 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.<br />కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 61,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 67,310 గా ఉంది. భవనేశ్వర్&zwnj;లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.</p> <p><strong>ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)&nbsp;</strong></p> <p>దుబాయ్&zwnj;లో (Today's Gold Rate in Dubai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 55,504.68 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,931.43 వద్దకు చేరింది. UAE, షార్జా, అబుదాబిలో ఇవే రేట్లు అమల్లో ఉన్నాయి.<br />మస్కట్&zwnj;లో (Today's Gold Rate in Muscat) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 57,487.39 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,302.21 వద్దకు చేరింది. &nbsp;<br />కువైట్&zwnj;లో (Today's Gold Rate in Kuwait) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 56,508.92 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,167.77 వద్దకు చేరింది.&nbsp;<br />మలేసియాలో (Today's Gold Rate in Malaysia) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 57,934.60 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,575.99 వద్దకు చేరింది.&nbsp;<br />సింగపూర్&zwnj;లో (Today's Gold Rate in Singapore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 56,790.88 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,977.25 వద్దకు చేరింది.&nbsp;<br />అమెరికాలో (Today's Gold Rate in United States) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 55,852.07 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,186.52 వద్దకు చేరింది.&nbsp;</p> <p>ప్లాటినం ధర (Today's Platinum Rate)<br />మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 40 తగ్గి ₹ 24,060 వద్ద ఉంది. హైదరాబాద్&zwnj;, వరంగల్&zwnj;, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.</p> <p>ధరల్లో మార్పులు ఎందుకు?<br />పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్&zwnj;లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్&zwnj;లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్&zwnj;లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.</p> <p>మరో ఆసక్తికర కథనం: <a title="600 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్&zwnj; - ప్రకాశిస్తున్న బజాజ్&zwnj; ట్విన్స్&zwnj;" href="https://telugu.abplive.com/business/stock-market-opening-today-stock-market-news-in-telugu-share-market-opening-today-on-28-march-2024-153424" target="_self">600 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్&zwnj; - ప్రకాశిస్తున్న బజాజ్&zwnj; ట్విన్స్&zwnj;</a></p>

  • Petrol Diesel Price Today 28 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
    by Arun Kumar Veera on March 28, 2024 at 3:24 am

    <p><strong>Petrol Diesel Price 28 March 2024:</strong> అమెరికాలో చమురు నిల్వలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్&zwnj;లో ముడి చమురు ధరలు మరికొంత తగ్గాయి. ప్రస్తుతం, WTI క్రూడ్&zwnj; ఆయిల్&zwnj; ధర బ్యారెల్&zwnj;కు 0.59 డాలర్లు పెరిగి 81.94 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్&zwnj; క్రూడ్&zwnj; బ్యారెల్&zwnj;కు 0.48 డాలర్లు పెరిగి 86.57 డాలర్ల వద్ద ఉంది.&nbsp;</p> <p><strong>తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్&zwnj; రేట్లు (Petrol-Diesel Rates Today In Telugu States):</strong></p> <p>తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)<br />హైదరాబాద్&zwnj;లో (Petrol Price in Hyderabad) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 107.41 ---- నిన్నటి ధర ₹ 107.41&nbsp;<br />వరంగల్&zwnj;లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 107.06 ---- నిన్నటి ధర ₹ 107.03&nbsp;<br />వరంగల్ రూరల్ జిల్లాలో (Petrol Price in Warangal Rural) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 106.84 ---- నిన్నటి ధర ₹ 107.06&nbsp;<br />నిజామాబాద్&zwnj;లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.01 ---- నిన్నటి ధర ₹ 109.48&nbsp;<br />నల్లగొండలో (Petrol Price in Nalgonda) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 107.51 ---- నిన్నటి ధర ₹ 107.54&nbsp;<br />కరీంగనర్&zwnj;లో (Petrol Price in Karimnagar&zwnj;) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 107.52 ---- నిన్నటి ధర ₹ 107.52&nbsp;<br />ఆదిలాబాద్&zwnj;లో (Petrol Price in Adilabad&zwnj;) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.57 ---- నిన్నటి ధర ₹ 109.65&nbsp;</p> <p>తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)<br />హైదరాబాద్&zwnj;లో (Diesel Price in Hyderabad) లీటరు డీజిల్ నేటి ధర ₹ 95.65 ---- నిన్నటి ధర ₹ 95.65<br />వరంగల్&zwnj;లో (Diesel Price in Warangal) లీటరు డీజిల్ నేటి ధర ₹ 95.32 ---- నిన్నటి ధర ₹ 95.28&nbsp;<br />వరంగల్ రూరల్ జిల్లాలో (Diesel Price in Warangal Rural) లీటరు డీజిల్&zwnj; నేటి ధర ₹ 95.11 ---- నిన్నటి ధర ₹ 95.32&nbsp;<br />నిజామాబాద్&zwnj;లో (Diesel Price in Nizamabad) లీటరు డీజిల్ నేటి ధర ₹ 97.14 ---- నిన్నటి ధర ₹ 97.57&nbsp;<br />నల్లగొండలో (Diesel Price in Nalgonda) డీజిల్&zwnj; నేటి ధర ₹ 95.72 ---- నిన్నటి ధర ₹ 95.76&nbsp;<br />కరీంగనర్&zwnj;లో (Diesel Price in Karimnagar&zwnj;) లీటరు డీజిల్&zwnj; నేటి ధర ₹ 95.74 ---- నిన్నటి ధర ₹ 95.74&nbsp;<br />ఆదిలాబాద్&zwnj;లో (Diesel Price in Adilabad&zwnj;) లీటరు డీజిల్&zwnj; నేటి ధర ₹ 97.66 ---- నిన్నటి ధర ₹ 97.73&nbsp;</p> <p>ఆంధ్రప్రదేశ్&zwnj;లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)<br />విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.58 ---- నిన్నటి ధర ₹ 109.31&nbsp;<br />గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.58 ---- నిన్నటి ధర ₹ 109.31&nbsp;<br />విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 108.29 ---- నిన్నటి ధర ₹ 108.29&nbsp;<br />తిరుపతిలో (Petrol Price in Tirupati) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.78 ---- నిన్నటి ధర ₹ 109.78&nbsp;<br />కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు &nbsp;నేటి ధర ₹ 109.12 ---- నిన్నటి ధర ₹ 109.85&nbsp;<br />రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram&zwnj;) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.10 ---- నిన్నటి ధర ₹ 108.94&nbsp;<br />అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.56 ---- నిన్నటి ధర ₹ 109.62&nbsp;</p> <p>ఆంధ్రప్రదేశ్&zwnj;లో డీజిల్&zwnj; ధరలు (Diesel Price in Andhra Pradesh)<br />విజయవాడలో (Diesel Price in Vijayawada) లీటరు డీజిల్&zwnj; నేటి ధర ₹ 97.42 ---- నిన్నటి ధర ₹ 97.17&nbsp;<br />గుంటూరులో (Diesel Price in Guntur) లీటరు డీజిల్&zwnj; నేటి ధర ₹ 97.42 ---- నిన్నటి ధర ₹ 97.17&nbsp;<br />విశాఖపట్నంలో (Diesel Price in Visakhapatnam) లీటరు డీజిల్&zwnj; నేటి ధర ₹ 96.17 ---- నిన్నటి ధర 96.17&nbsp;<br />తిరుపతిలో (Diesel Price in Tirupati) లీటరు డీజిల్&zwnj; నేటి ధర ₹ 97.55 ---- నిన్నటి ధర ₹ 97.55&nbsp;<br />కర్నూలులో (Diesel Price in Kurnool) లీటరు డీజిల్&zwnj; నేటి ధర ₹ 96.99 ---- నిన్నటి ధర ₹ 97.67&nbsp;<br />రాజమహేంద్రవరంలో (Diesel Price in Rajamahendravaram&zwnj;) లీటరు డీజిల్&zwnj; నేటి ధర ₹ 96.96 ---- నిన్నటి ధర ₹ 96.81&nbsp;<br />అనంతపురంలో (Diesel Price in Anantapur) లీటరు డీజిల్&zwnj; నేటి ధర ₹ 97.40 ---- నిన్నటి ధర ₹ 97.44&nbsp;</p> <p>మరో ఆసక్తికర కథనం: <a title="పెరుగుతున్న పసిడి ప్రకాశం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి" href="https://telugu.abplive.com/business/gold-silver-prices-today-28-march-2024-know-rates-in-your-city-telangana-hyderabad-andhra-pradesh-amaravati-153356" target="_self">పెరుగుతున్న పసిడి ప్రకాశం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి</a></p>

  • Mylavaram Assembly Constituency: వామపక్షాల కంచుకోటపై కాంగ్రెస్ పాగా వేయగా....వారి ఆశలకు టీడీపీ గండికొట్టింది
    by Ajay Kumar on March 28, 2024 at 2:00 am

    <p><strong>NTR District News:</strong> ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం (Mylavaram Assembly Constituency) 1955లో ఏర్పాటు చేయగా.. తొలుత కమ్యూనిస్టులు ప్రభావం చూపారు. ఆ తర్వాత కాంగ్రెస్(Congress) కంచుకోటగా మారింది. తెలుగుదేశం(Telugu Desam) ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థులు పాగా వేయగా....ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో దిగారు.</p> <p><strong>కమ్యూనిస్టుల కోట</strong><br />ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావం అనంతరం 1955లో మైలవరం కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటైంది. ఆ రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా(Krishna District) వ్యాప్తంగా వామపక్షాల ప్రభావం అధికంగా ఉండటంతో...ఇక్కడ సైతం సీపీఐ(CPI) పార్టీ అభ్యర్థి వెల్లంకి విశ్వేశ్వరరావు కేవలం 84 ఓట్ల తేడాతో కాంగ్రెస్(Congress) అభ్యర్థి పెడర్ల వెంకటసుబ్బయ్యపై విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1962 ఎన్నికల్లోనూ అదే అభ్యర్థులు పోటీపడగా..సీపీఐ ఈ సీటు నిలబెట్టుకుంది. అప్పుడు విశ్వేశ్వరరావు 514 ఓట్లతో &nbsp;విజయం సాధించారు. 1967లో తొలిసారి కాంగ్రెస్ తరపున చనుమోలు వెంకట్రావు(Chanumolu Venkatarao) జయకేతనం ఎగురవేశారు. దాదాపు 20వేల ఓట్ల మెజార్టీ సాధించారు....1972, 78లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు.</p> <p>తెలుగుదేశం(Telugu Desam) ఆవిర్భావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్(NTR) ప్రభావం చూపగా....ఆ పార్టీ తరఫున నిమ్మగడ్డ సత్యనారాయణ విజయం సాధించారు. 4వేల 200 ఓట్ల మెజార్టీతో చనుమోలు వెంకట్రావుపై గెలుపొందారు. &nbsp;ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ చనుమోలు వెంకట్రావు &nbsp;నిమ్మగడ్డ సత్యనారాయణను ఓడించారు.. 1989లో కోమటి భాస్కర్&zwnj;రావు కాంగ్రెస్&zwnj; తరఫున....తెలుగుదేశం నుంచి జేష్ఠ రమేశ్&zwnj;బాబు పోటీపడగా...కాంగ్రెస్&zwnj;ను విజయం వరించింది. 1994 లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీయడంతో మైలవరంలోనూ &nbsp;ఆ పార్టీ అభ్యర్థి జేష్ఠ రమేష్&zwnj; 7వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు.</p> <p>1999లో విజయవాడ సిట్టింగ్ ఎంపీ వడ్డే శోభనాధ్రీశ్వరరావుకు తెలుగుదేశం టిక్కెట్ కేటాయించగా...కాంగ్రెస్&zwnj; నుంచి కోమటి సుబ్బారావుపై విజయం సాధించారు. 2004లో రాజశేఖర్&zwnj;రెడ్డి పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్&zwnj; జయకేతనం ఎగురవేయగా...ఆ పార్టీ సీనియర్ &nbsp;కాంగ్రెస్&zwnj; నుంచి చనుమోలు వెంకట్రావు ఐదోసారి గెలుపొందారు. 2009లో తెలుుదేశం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీపడగా... <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a>&zwnj; అభ్యర్థి సందీప్&zwnj;పై విజయం సాధించారు. నందిగామ ఎస్సీ రిజర్వ్&zwnj;డు కావడంతో దేవినేని ఉమ (Devineni Uma) మైలవరం నుంచి బరిలో దిగాల్సి వచ్చింది.</p> <p>రాష్ట్ర విభజన అనంతరం 2014లో వరుసగా రెండోసారి గెలిచిన దేవినేని ఉమ...<a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మూడోసారి మైలవరం నుంచి దేవినేని ఉమ పోటీపడగా...గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) రంగంలోకి దిగి విజయం సాధించారు. తదనంతర పరిణామాల్లో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ(YCP) వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా...ప్రస్తుతం మైలవరం టిక్కెట్&zwnj; ఆయకే కేటాయించారు. వైసీపీ తరపున సరనాల తిరుపతిరావు యాదవ్&zwnj;((Tirupati Yadav) బరిలో దిగారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థి వసంతపై తిరుపతిరావు యాదవ్&zwnj; ఏ మేరకు నెట్టుకురాగలరో చూడాలి.</p> <p><strong>నియోజకవర్గ స్వరూపం</strong><br />మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాలతోపాటు విజయవాడ రూరల్ మండలంలో కొంత భాగం మైలవరం నియోజకవర్గం కిందకు వస్తుంది. జనరల్ కేటగిరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు &nbsp;2,80,000 &nbsp;మంది ఉన్నారు.&nbsp;</p>

  • Gold-Silver Prices Today: పెరుగుతున్న పసిడి ప్రకాశం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
    by Arun Kumar Veera on March 28, 2024 at 1:41 am

    <p><strong>Gold-Silver Prices 28 March 2024:</strong> యూఎస్&zwnj; పీసీయీ డేటా మీద ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడంతో అంతర్జాతీయ మార్కెట్&zwnj;లో పసిడి మరింత ప్రకాశవంతంగా మారింది. ప్రస్తుతం, ఔన్స్&zwnj; (28.35 గ్రాములు) బంగారం ధర 2,212 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్&zwnj; బంగారం &zwj;&zwnj;(22 కేరెట్లు) ధర 200 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి &zwj;&zwnj;(24 కేరెట్లు) ధర 220 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 160 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు ₹ 300 తగ్గింది.</p> <p><strong>తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)</strong></p> <p>తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)<br />హైదరాబాద్&zwnj; (Gold Rate in Hyderabad) మార్కెట్&zwnj;లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 61,350 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 66,930 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 50,190 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్&zwnj;లో ₹ 80,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.</p> <p>ఆంధ్రప్రదేశ్&zwnj;లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)<br />విజయవాడలో &zwj;(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 61,350 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 66,930 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 50,190 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 80,200 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్&zwnj;లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.&nbsp;</p> <p><strong>దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)&nbsp;</strong></p> <p>చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 62,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 67,800 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.<br />ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 61,350 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 66,930 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.<br />దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 61,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 67,080 గా నమోదైంది. జైపుర్&zwnj;, లఖ్&zwnj;నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.<br />కోల్&zwnj;కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 61,350 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 66,930 గా ఉంది. నాగ్&zwnj;పుర్&zwnj;లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.<br />బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 61,350 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 66,930 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.<br />కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 61,350 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 66,930 గా ఉంది. భవనేశ్వర్&zwnj;లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.</p> <p><strong>ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)&nbsp;</strong></p> <p>దుబాయ్&zwnj;లో (Today's Gold Rate in Dubai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 55,585.35 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,066.22 వద్దకు చేరింది. UAE, షార్జా, అబుదాబిలో ఇవే రేట్లు అమల్లో ఉన్నాయి.<br />మస్కట్&zwnj;లో (Today's Gold Rate in Muscat) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 57,673.80 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,487.15 వద్దకు చేరింది. &nbsp;<br />కువైట్&zwnj;లో (Today's Gold Rate in Kuwait) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 56,037.59 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,556.86 వద్దకు చేరింది.&nbsp;<br />మలేసియాలో (Today's Gold Rate in Malaysia) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 57,788.68 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,079.09 వద్దకు చేరింది.&nbsp;<br />సింగపూర్&zwnj;లో (Today's Gold Rate in Singapore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 56,334.60 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,456.58 వద్దకు చేరింది.&nbsp;<br />అమెరికాలో (Today's Gold Rate in United States) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 55,405.74 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 58,738.41 వద్దకు చేరింది.&nbsp;</p> <p>ప్లాటినం ధర (Today's Platinum Rate)<br />మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 40 పెరిగి ₹ 24,100 వద్ద ఉంది. హైదరాబాద్&zwnj;, వరంగల్&zwnj;, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.</p> <p>ధరల్లో మార్పులు ఎందుకు?<br />పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్&zwnj;లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్&zwnj;లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్&zwnj;లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.</p> <p>మరో ఆసక్తికర కథనం: <a title="స్టాక్ మార్కెట్&zwnj;లో టాటా గ్రూప్&zwnj; ప్రకంపనలు, వచ్చే మూడేళ్లలో 8 IPOలు!" href="https://telugu.abplive.com/business/tata-group-may-bring-up-to-8-ipos-in-next-2-to-3-years-know-ipo-names-153290" target="_self">స్టాక్ మార్కెట్&zwnj;లో టాటా గ్రూప్&zwnj; ప్రకంపనలు, వచ్చే మూడేళ్లలో 8 IPOలు!</a></p>

  • Kovur Politics: ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలతో ప్రశాంతి రెడ్డికి ఉచిత ప్రచారం
    by ABP Desam on March 27, 2024 at 6:45 pm

    <p>Kovur Assembly constituency: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సంచలన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గం నుంచి ఆయనకు జయాలు, పరాజయాలు రెండూ ఉన్నాయి. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడిగా నెల్లూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి మంత్రి, తాను కూడా మంత్రిగా చేశారు. ప్రస్తుతం కాలం కలసిరాక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ హయాంలో మినిస్టర్ పోస్ట్ వస్తుందనుకుంటే రెండుసార్లూ ఆయనకు నిరాశే ఎదురైంది. చివరకు చేసేదేం లేక ఈసారయినా అవకాశం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు అనుకోకుండా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యర్థి అయ్యారు. దీంతో కాస్త ఆందోళనలో ఉన్న ప్రసన్న.. ఘాటు వ్యాఖ్యలతో రచ్చకెక్కారు.&nbsp;</p> <p>నెల్లూరులో ప్రత్యర్థులపై బాగా నోరు చేసుకునే నాయకుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఒకరు. గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసిన ఆయనకు చంద్రబాబు అంటే అస్సలు పడదు. వైసీపీలో చేరిన తర్వాత <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a>పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు, చేస్తూనే ఉన్నారు. టీడీపీనేతలందరిపై కూడా ప్రసన్న ఘాటు వ్యాఖ్యలు చేసేవారు. తాజాగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండో భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటూ ఆమె వ్యక్తిగత జీవితాన్ని తెరపైకి తెచ్చారు ప్రసన్న. అయితే ఈ విమర్శలు ఆయనకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయి. ప్రసన్న వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది.&nbsp;</p> <p><strong>ప్రశాంతి రెడ్డికి ప్రచారం..</strong><br />వీపీఆర్ చాన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్నా కూడా ఎప్పుడూ తన వ్యక్తిగత వివరాలను బయటపెట్టలేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా తన వివాహం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత ప్రశాంతి రెడ్డి మరింత ధైర్యంగా ప్రజల్లోకి వచ్చారు. తన గురించి తాను చెప్పుకున్నారు. తన మొదటి భర్త ఎవరు, తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎందుకు వివాహం చేసుకోవలసి వచ్చిందనే విషయాన్ని బహిర్గతం చేశారు. విమర్శకుల నోళ్లు ఒకేసారి మూయించారు. దీంతో ఆమెకు కోవూరులో మరింత ప్రచారం లభించింది. వ్యక్తిగత వ్యాఖ్యలతో ఆమె కుంగిపోకుండా ధైర్యంగా ప్రజల ముందుకొచ్చినందుకు ఆమెను అందరూ అభినందిస్తున్నారు.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="te">సొంత తల్లి, చెల్లిని అవమానించే<br />దుర్మార్గుడు ఏ మహిళకు మర్యాద ఇస్తాడు? <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> పేటిఎం కుక్కల ట్రోలింగ్స్ కి ఎదురునిలబడి ధైర్యంగా పోరాడుతున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.<a href="https://twitter.com/hashtag/YCPAntham?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#YCPAntham</a> <a href="https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#AndhraPradesh</a> <a href="https://t.co/3asXrwloVe">pic.twitter.com/3asXrwloVe</a></p> &mdash; Lokesh Nara (@naralokesh) <a href="https://twitter.com/naralokesh/status/1772521630558024014?ref_src=twsrc%5Etfw">March 26, 2024</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>లోకేష్ అభినందనలు.</strong><br />ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల అనంతరం ప్రశాంతి రెడ్డి ధైర్యంగా నిలబడ్డారని, నారా లోకేష్ కూడా అభినందించారు. ఆమె వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. లోకేష్ ట్వీట్ తో ప్రశాంతి రెడ్డి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఉన్న మహిళల గురించి వైసీపీ ఎమ్మెల్యే నీఛంగా మాట్లాడారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ప్రసన్న వ్యాఖ్యల్ని నెల్లూరు <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> నేతలంతా ముక్త కంఠంతో ఖండించారు. ఇప్పుడు వైసీపీ నుంచే కొందరు ప్రసన్న వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.</p> <p>ప్రసన్న వ్యాఖ్యలకు మద్దతుగా వైసీపీ నేతలెవరూ స్పందించలేదు. కనీసం ఆయన మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా ఆ తర్వాత ఆ వ్యాఖ్యల జోలికే వెళ్లేదు. దీంతో ఒకరకంగా ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు వైసీపీలో ఒంటరిగా మారారు. ప్రత్యర్థి ప్రశాంతి రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రసన్న ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారంతా. అయితే ప్రసన్న వ్యాఖ్యలతో ఆయన అనుకున్నది సాధ్యం కాకపోగా.. ఆయన ప్రత్యర్థి ప్రశాంతి రెడ్డిపై సింపతీ పెరిగింది. ఆమెకు ఊహించని మద్దతు లభించింది.&nbsp;</p>

  • Venkatagiri Politics: రెండు పార్టీల్లోనూ అసమ్మతి, వెంకటగిరిలో గెలుపెవరిది? 
    by ABP Desam on March 27, 2024 at 4:47 pm

    <p>Venkatagiri News: ఏపీ ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమి పోరులో కొన్ని చోట్ల అంతర్గత రాజకీయాలు చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఒక్కోచోట ఒక్కో పార్టీలోనే సమస్యలు ఉంటే.. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాత్రం రెండు పార్టీల్లోనూ సమస్యలున్నాయి. ఇక్కడ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఇక టీడీపీలో ఏకంగా టికెట్ ఆశించి భంగపడిన నాయకుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఇంటిపోరుని త్వరగా పరిష్కరించుకోగలిగే పార్టీకే ఇక్కడ విజయం వరించే అవకాశాలున్నాయి.&nbsp;</p> <p><strong>వైసీపీ పరిస్థితి ఏంటి..?</strong><br />2019లో ఇక్కడ వైసీపీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆయన పార్టీకి దూరమయ్యారు. కాలక్రమంలో టీడీపీలో చేరి, ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే ఆయనకు ప్రస్తుతం వెంకటగిరితో పనిలేదు. ఇక వైసీపీ అభ్యర్థిగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఇక్కడ ఇంటిపోరు ఎక్కువైంది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తండ్రి మాజీ సీఎం జనార్దన్ రెడ్డి, తల్లి రాజ్యలక్ష్మి.. ఇద్దరూ వెంకటగిరికి ప్రాతినిధ్యం వహించినవారే. ఈ నియోజకవర్గంలో నేదురుమల్లి కుటుంబానికి మంచి పట్టు ఉంది. కానీ రామ్ కుమార్ రెడ్డి హయాంలో మాత్రం ఆ ఫ్యామిలీకి ఉన్న ఓట్లు చెల్లాచెదురయ్యాయి. నేదురుమల్లి అనే బ్రాండ్ ఇక్కడ పెద్దగా పనిచేయట్లేదు. కేవలం జగన్ బ్రాండ్ చూసి మాత్రమే ఓటర్లు వైసీపీవైపు రావాల్సి ఉంటుంది. ఇటీవల టికెట్ల ఖరారు సమయంలో కూడా నేదురుమల్లి వ్యతిరేక వర్గం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర పంచాయితీ పెట్టింది. ఆ తర్వాత వైరి వర్గం నేతలు ఏకంగా మీటింగ్ పెట్టుకున్నారు. నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా ఉన్న మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాను స్వతంత్రంగా బరిలో ఉంటానన్నారు. ఈ సమస్యను వైసీపీ అధిష్టానం పరిష్కరించాల్సి ఉంది.&nbsp;</p> <p><strong>టీడీపీ పరిస్థితి ఏంటి..?</strong><br />టీడీపీలో మొన్నటి వరకు టికెట్ పంచాయితీ ఉండేది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా తనకు వెంకటగిరి కావాలన్నారు. ఆయన ఆత్మకూరుకి వెళ్లిపోవడంతో చివరకు ఇద్దరు ఆశావహులు బరిలో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ప్రధాన పోటీదారుగా డాక్టర్ మస్తాన్ యాదవ్ ఉన్నారు. మస్తాన్ యాదవ్ బీసీ కోటాలో తనకు సీటు కావాలన్నారు. కానీ <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> అనూహ్యంగా వారిద్దర్నీ కాదని కురుగొండ్ల కుమార్తె లక్ష్మీ సాయి ప్రియకు టికెట్ ఇచ్చారు. దీంతో మస్తాన్ యాదవ్ హర్ట్ అయ్యారు. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.&nbsp;</p> <p>మస్తాన్ యాదవ్ చేరికతో వైసీపీ బలం పెరిగిందని అనుకున్నా.. ఇటు ఇంటిపోరుతో ఆ పార్టీ సతమతం అవుతోంది. ప్రస్తుతానికి వెంకటగిరిలో మహిళా అభ్యర్థిగా లక్ష్మీ సాయిప్రియకే మొగ్గు ఎక్కువగా కనపడుతోంది. ఈ దశలో వైసీపీ దిద్దుబాటు చర్యలు చేపడుతుందా..? అసమ్మతి వర్గాన్ని బుజ్జగిస్తుందా..? వేచి చూడాలి. అటు మస్తాన్ యాదవ్ మైనస్ కావడంతో <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a>కి కూడా కొన్ని ఓట్లు కోత పడక తప్పదు. ఆ గ్యాప్ ని తెలుగుదేశం ఎలా కవర్ చేస్తుందో చుడాలి.&nbsp;</p> <p>&nbsp;</p>

  • Andhra Pradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీపై వాలంటీర్లకు సెర్ప్‌ కీలక ఆదేశాలు
    by Shankar Dukanam on March 27, 2024 at 4:32 pm

    <p>AP Volunteers Distributes Pension: అమరావతి: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్&zwnj;సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం, అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు వాలంటీర్లను ఎన్నికల పనుల నుంచి తప్పించాలని, వారితో ప్రచారం కూడా చేయించవద్దని ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఏప్రిల్, మే నెలల్లో వాలంటీర్లు లబ్ధిదారులకు పింఛన్ అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాలంటీర్లకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్&zwnj;) ఓ సర్క్యులర్&zwnj; జారీ చేసింది.&nbsp;</p> <p>ఎన్నికల కోడ్&zwnj; ఉన్నందున ఆథరైజేషన్&zwnj; పత్రాలు తీసుకోవాలని వాలంటీర్లకు సెర్ప్ సూచించింది. లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చేందుకు బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్&zwnj; డాక్యుమెంట్ తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాలంటీర్లు ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని పేర్కొన్నారు.&nbsp;</p> <p>మార్చి నెలలో జరిగినట్లు ఏప్రిల్, మే నెలలో చేయకూడదంటూ వాలంటీర్లకు సెర్ప్ కొన్ని సూచనలు చేసింది. పెన్షన్ పంపిణీ చేస్తున్న సమయంలో ఫొటోలు గానీ, వీడియోలు గానీ తీయడం లాంటివి చేయకూడదని వాలంటీర్లకు సూచించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, ఏ అభ్యర్థికైనా ఓటు వేయాలంటూ లబ్ధిదారులకు చెప్పినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. &nbsp;</p>